బీజేపీలోకి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల చేరిక

చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని ఊరెళ్ళ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాయికాడి నర్సిములు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో నర్సిములు, అశోక్, జనార్దన్, అనీల్, బన్నీ, ఆదర్శ్ సహా సుమారు 25 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎంపీపీ విజయ లక్ష్మి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు, అభిమానులు తదితరులు … Read more

అభివృద్ధే లక్ష్యం: ఎండి జాహేద్

అభివృద్ధే లక్ష్యం: ఎండి జాహేద్ చేవెళ్ళ: చేవెళ్ల,మున్సిపల్‌ 11వ వార్డు (ఇబ్రహీంపల్లి) నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఎండి జాహిద్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజల సేవే తన మార్గమని, వార్డు సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలతో కలిసి 11వ వార్డుని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తనను కుటుంబ … Read more

డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్, వైద్య కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

రంగారెడ్డి : చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్, వైద్య కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి కామెంట్స్ :- స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నిర్మించిన భారత రాజ్యాంగ సూత్రాలు లక్ష్యాలను జాతీయ నాయకులు కలలుగన్న విధంగా అమలు పరచుకొని ప్రపంచంలోనే భారతదేశాన్ని అద్భుతమైన శక్తిగా తీర్చిదిద్దుకుందాం. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి వారి … Read more

తెలంగాణ భవన్‌లో సబితా ఇంద్రారెడ్డిని కలిసిన జాహేద్

తెలంగాణ భవన్‌లో సబితా ఇంద్రారెడ్డిని కలిసిన జాహేద్ తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఇబ్రహీంపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మహమ్మద్ జాహేద్ చేవెళ్ల మండల నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వార్డు ల స్థాయి రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ను మరింత బలంగా నిలబెట్టే దిశగా కృషి … Read more

“తెలంగాణ వెలుగులు.. 2026 పద్మ పురస్కారాల్లో సత్తా చాటిన హైదరాబాద్ ప్రముఖులు”

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ నుండి 7 మంది ప్రముఖులు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌తో సంబంధం ఉన్నవారే. తెలంగాణ నుండి పద్మశ్రీ గ్రహీతలు (7 మంది): దీపికా రెడ్డి (కళలు): ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో ఈమె చేసిన కృషికి గుర్తింపు లభించింది. డాక్టర్ గూడూరు వెంకట రావు (వైద్యం): AIG హాస్పిటల్స్ (హైదరాబాద్) డైరెక్టర్. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో నిపుణులు. … Read more

చేవెళ్ల మండలం లోని మడికట్టు గ్రామంలో ప్రశంసనీయ సేవ

మండల్ ప్రాథమిక పాఠశాల స్కూల్ గ్రౌండ్ చుట్టూ కడిలు, తారు పనులు మడికట్టు గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ జయలత బాల్ రెడ్డి గారు గ్రామాభివృద్ధి పట్ల తమ బాధ్యతను మరోసారి నిరూపించారు. గ్రామ ప్రాథమిక పాఠశాల గ్రౌండ్ చుట్టూ తమ సొంత నిధులతో కడిలు ఏర్పాటు చేసి, తారు చుట్టింపించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన భద్రత కల్పించారు. ఇంతకు ముందు పాఠశాల గ్రౌండ్ చుట్టూ సరైన సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులు ఆటల సమయంలో బయటకు వెళ్లే అవకాశం … Read more

తెలంగాణ ప్రభుత్వం సంగ్రహం

తెలంగాణ ప్రభుత్వం సంగ్రహం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ నిబంధనలు, 2025 సవరణల ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. “తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ సాధారణ పరిపాలన (సమాచార మరియు పౌర సంబంధాల) శాఖ జి.ఓ. ఆర్టి.నెం.103 తేదీ: 24.01.2026. కింది వాటిని చదవండి:- 1. జి.ఓ. ఎంఎస్. నెం. 252, జి.ఎ(ఐ&పిఆర్) శాఖ, తేది. 22.12.2025. 2. ప్రత్యేక కమిషనర్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ నుండి, లేఖ నెం.6677/ఎంఆర్/2026 తేది.24.01.2026 ఉత్తర్వు: జి.ఓ.ఎంఎస్.నెం.252 జి.ఎ. … Read more

జాతీ రత్నాలుగా ఎదగాలి – సినీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి

జాతీ రత్నాలుగా ఎదగాలి – ఆదర్శంగా సత్య సాయి స్కూల్ – తల్లిదండ్రులకు హెల్మెట్ గిఫ్ట్ గా ఇవ్వండి – సినీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి చేవెళ్ల జనవరి 26 : విద్యార్థులు రేపటి జాతి రత్నాలు ఎదగాలని సినీ, మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ బిత్తిరి సత్తి అలియాస్ పామెన కావలి రవికుమార్ సూచించారు. సోమవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సత్య సాయి గ్రామర్ హైస్కూల్ లో వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు … Read more

ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు కొనసాగించాలి: కాంగ్రెస్ డిమాండ్

  చేవెళ్ల: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేవెళ్ల మండలం మూడిమ్యాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద మాజీ పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… గాంధీ పేరును తొలగించే ప్రయత్నం దురుద్దేశపూరితమని, నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌడిచర్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పడాల … Read more

ఇక షోరూం వద్దే రిజిస్ట్రేషన్.. నేరుగా ఇంటికే ఆర్సీ కార్డు!

 

కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి రవాణా శాఖ భారీ ఊరటనిచ్చింది. ఇకపై కొత్త బండి కొన్నాక రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ (RTO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్‌ ఇలాంబర్తి కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త విధానం విశేషాలు ఇవే:

  • షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్: వాహనం కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. డీలర్లే ఆన్‌లైన్ ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేస్తారు.

  • నేరుగా ఇంటికే ఆర్సీ (RC): రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటి చిరునామాకే ఒరిజినల్ ఆర్సీ కార్డు వస్తుంది.

  • తగ్గనున్న తిప్పలు: ఆఫీసుల వద్ద స్లాట్ బుకింగ్, క్యూ లైన్లలో నిలబడటం, దళారుల బెడద వంటి ఇబ్బందులకు ఈ నిర్ణయంతో చెక్ పడనుంది.

ప్రక్రియ ఎలా జరుగుతుంది?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహన్’, ‘సారథి’ పోర్టళ్లను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చారు. వాహనం అమ్మిన డీలర్.. ఇన్వాయిస్, ఫారం-21, 22, ఇన్సూరెన్స్ మరియు అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారులు వాటిని పరిశీలించి నంబర్‌ను కేటాయిస్తారు. అవసరమైతే అధికారులు షోరూం వద్దే వాహనాన్ని తనిఖీ చేస్తారు.

ముఖ్య గమనికలు:

  1. వ్యక్తిగత వాహనాలకే: ఈ సౌకర్యం కేవలం ద్విచక్ర వాహనాలు మరియు వ్యక్తిగత కార్లకు మాత్రమే వర్తిస్తుంది.

  2. వాణిజ్య వాహనాలు: లారీలు, ఆటోలు వంటి వాణిజ్య (Commercial) వాహనాలకు మాత్రం పాత పద్ధతిలోనే ఆర్టీఓ ఆఫీసుకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

  3. ఫ్యాన్సీ నంబర్లు: నచ్చిన నంబర్ కావాలనుకునే వారు మాత్రం రవాణా శాఖ ఆ సిరీస్ విడుదల చేసే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో ఏటా సుమారు 6 లక్షల బైకులు, 1.75 లక్షల కార్లు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో, ప్రజలకు వేగవంతమైన మరియు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.