చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు
చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ కరికె మీనాక్షి సత్యనారాయణ, 10వ వార్డు కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్, 12వ వార్డు కౌన్సిలర్ అతెళ్లి మనీషా అనంత్ రెడ్డి తదితరులు మాజీ ఎమ్మెల్యే రత్నం, భాజపా చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంతరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ వెంకటేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశం, మేనేజరు నరేందర్ తో పాటు చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమత వెంకటరెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ బండారు శైలజ ఆగి రెడ్డిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
