చేవెళ్ల ప్రభుత్వ బాలుర పాఠశాల 1990 బ్యాచ్ (7వ తరగతి) పూర్వ విద్యార్థులు సుమారు రూ. 10 లక్షల వ్యయంతో పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా బాలికల జెడ్పీ, ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు మరియు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. PACS చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, మువ్వ అమరేందర్ యాదవ్, గడ్డం దయానంద్ తదితరుల చొరవను స్థానికులు అభినందించారు.